
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 'రెడ్బ్యాక్స్" నీర్ణతే 20 ఓవర్లలో 214లు సాధించంది. ఓపెనర్ హారిస్ మెరపు షాట్లతో 108 పురుగులు సాధించి నాటౌట్గా నిలవగా, మరో బ్యాట్సమెన్ ఫెర్గూసన్ 70 పరుగులు సాధించి జట్టుకు తన సహకారాన్ని అందించాడు. 215 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్ ఆరంభించిన ఛాలెంజర్స్ జట్టు ఆరంభం నుంచే స్కోర్ బోర్డును పరిగెత్తించింది. ఓపెనర్ క్రిస్ గేల్ 26 పరుగులు సాధించి వెనుతిరిగినప్పటికి, విరాట్ కోహ్లీ (70), తిలకరత్నే దిల్షాన్ (74)లు సౌత్ ఆస్ట్రేలియా బౌలర్ల పనిపట్టారు. బెంగూళూరు జట్టుకు దాదాపు విజయం ఖాయమనుకున్న తరుణంలో బౌలర్ షాన్ టైట్ విరుచుకుపడ్డాడు, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి రాయల్ ఛాలెంజర్స్ ఆశలను గల్లంతు చేశాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావల్సి ఉండగా, డానియల్ క్రిస్టియన్ వేసిన బంతిని అరుణ్ కార్తీక్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాది ఛాలెంజర్స్ సెమీస్ మార్గాన్ని సుగమం చేశాడు.