భోపాల్: సరైన శిక్షణ ఇస్తే జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డులను బ్రేక్ చేస్తా అని 19 ఏండ్ల రామేశ్వర్ గుర్జర్ అంటున్నాడు. మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లా నర్వాల్ గ్రామానికి చెందిన రామేశ్వర్ది వ్యవసాయ కుటుంబం. రామేశ్వర్కు రన్నింగ్లో మంచి ప్రతిభ ఉంది. ఈ క్రమంలో రామేశ్వర్ కనీసం చెప్పులు కూడా లేకుండా 100 మీటర్ల పరుగును కేవలం 11 సెకన్లలో చేధించే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
ట్విట్టర్లో అనుష్క శర్మ బికినీ ఫోటో..: ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది కాస్తా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. 'భారత్లో వ్యక్తిగత నైపుణ్యానికి కొదవలేదు. వారికి సరైన వేదిక దొరికినప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. రామేశ్వర్ లాంటి ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తే దేశానికి మంచి పేరుతెస్తారంటూ' ఆ వీడియోను కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేశారు.
దీనిపై స్పందించిన రిజిజు.. అతడిని ఎలాగైనా నా వద్దకు పంపించండి. తప్పకుండా అతడిని అథ్లెటిక్ అకాడమీలో చేరుస్తా' అని బదులిచ్చారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి స్పందనపై రామేశ్వర్ గుర్జర్ మాట్లాడుతూ... 'జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్ (9.58 సెకన్లు) పేరిట 100 మీటర్ల ప్రపంచ రికార్డు ఉంది. నాకు సరైన శిక్షణ, సదుపాయాలు కల్పిస్తే బోల్ట్ రికార్డును బ్రేక్ చేస్తాననే నమ్మకం ఉంది' అని రామేశ్వర్ ధీమా వ్యక్తం చేసాడు.
సోషల్ మీడియాలోనూ కోహ్లీ హవా.. సచిన్, ధోనీలను మించి ఫాలోవర్లు