మొహాలీ: ఐపీఎల్-8 లీగ్లో వరుసగా ఏడు ఓటముల తర్వాత పంజాబ్కు విజయం దక్కింది. అక్షర్ పటేల్ (20 నాటౌట్, 2/11) ఆల్ రౌండ్ నైపుణ్యంతో పంజాబ్ 22 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. బుధవారంనాడు వర్షం రావడంతో కింగ్స్ ఎలెవవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచును పదేసి ఓవర్లకు కుదించారు.
పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (31) తన ప్రతిభను చాటాడు. ఆ తర్వా బెంగళూరు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగులే చేసింది.
మన్దీప్ (20) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఓటమితో కోహ్లీసేన ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. తొలుత వర్షం కారణంగా 2 గంటలా 45 నిమిషాల ఆట తుడిచి పెట్టుకుపోయింది. దీంతో మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించారు. అక్షర్ పటేల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
లక్ష్య ఛేదనలో బెంగళూరు కూడా ధాటిగానే ఆడింది. ఓపెనర్లు గేల్-కోహ్లీ తొలి వికెట్కు 33 పరుగులు జోడించారు. అయితే స్వల్ప తేడాతో కోహ్లీ (19), గేల్ (17) అవుటయ్యారు. ఆ తర్వాత భారీ అంచనాలున్న ఏబీ డివిల్లీర్స్ (10), మన్దీప్, కార్తీక్ (2) అవుట్ కావడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఓపెనర్ సాహా మెరుపు ఆరంభం ఇచ్చాడు. వోహ్రా (11), మాక్స్వెల్ (10)ను అవుట్ చేసి హర్షల్ పటేల్ పంజాబ్కు షాకిచ్చాడు. చివర్లో మిల్లర్ (14), కెప్టెన్ బెయిలీ (13), గురుకీరత్ (2) అవుటయ్యారు.