హైదరాబాద్: ప్రొ వాలీబాల్ లీగ్లో బ్లాక్హాక్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. తొలి రెండు మ్యాచ్లు ఏకపక్షంగా సాగిన ప్రొ వాలీబాల్ లీగ్లో సోమవారం నాటి మూడో మ్యాచ్లో ఆఖరి సెట్ వరకూ విజయం దోబూచులాడింది. ఈ క్రమంలో సోమవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 15-11, 13-15, 15-11, 14-15, 15-9తో అహ్మదాబాద్ డిఫెండర్స్పై విజయం సాధించింది.
బ్లాక్ హాక్స్ కెప్టెన్ కార్సన్ క్లార్క్ (15 పాయింట్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. క్లార్క్ 12 స్పైక్ పాయింట్లు సహా 2 సర్వీస్, 1 బ్లాక్ పాయింట్ సాధించాడు. బ్లాకర్ అష్వల్ రాయ్ (14), అటాకర్ రోహిత్ కుమార్ (11) కూడా సత్తా చాటారు. ప్రత్యర్థి అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసోవ్ (12 పాయింట్లు) అత్యధిక పాయింట్లు స్కోర్ చేశాడు.
మరో అటాకర్ గగన్దీప్ సింగ్ (8 పాయింట్లు) ఆకట్టుకోగా... బ్లాకర్ వైష్ణవ్ (7), బ్లాకర్ నొవాక జలిక (6) పర్లేదనిపించారు. మొదటి నాలుగు సెట్లను హైదరాబాద్, అహ్మదాబాద్ చెరో రెండు గెలవడంతో నిర్ణాయక ఆఖరి సెట్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అయితే చివరి సెట్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసింది.
మొత్తంగా అహ్మదాబాద్ స్పైక్లో 33 పాయింట్లు సాధిస్తే... హైదరాబాద్ 39 చేసింది. సర్వీస్లో బ్లాక్హాక్స్ 8, డిఫెండర్స్ 4 పాయింట్లు చేయగా, ప్రత్యర్థి తప్పిదాలతో అహ్మదాబాద్కు 16 పాయింట్లు వస్తే, హైదరాబాద్కు 19 పాయింట్లు లభించడం విశేషం.