హైదరాబాద్: మంగోలియా వేదికగా జరుగుతున్న సీనియర్ ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో భారత జిమ్నాస్ట్ కాంస్యం గెలుచుకుంది. శుక్రవారం జరిగిన మహిళల వాల్ట్ ఈవెంట్లో 23 ఏళ్ల ప్రణతి 13.384 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.
అర్హత పోటీల్లో ఆరో స్థానంలో నిలిచిన ప్రణతి పైనల్లో మాత్రం ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ పతకాన్ని కొల్లగొట్టింది. లిన్మిన్ (చైనా) 14.350 స్కోరుతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, సకాగూచి (జపాన్) 13.584 స్కోరుతో రజతం దక్కించుకుంది.