ముంబై: తెలిసి గానీ తెలియక గానీ నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రపంచ కప్ పోటీల నుంచి తప్పిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. క్రికెట్ 2011 ప్రపంచ కప్ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీన ఢాకాలో ప్రారంభమవుతున్నాయి. జట్టు నిబంధనలను ఉల్లంఘించే ఆటగాడికి ఆర్థిక జరిమానా విధించడంతో పాటు పోటీల నుంచి తప్పిస్తామని ఐసిసి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకున ఐసిసి లీగల్ హెడ్ డేవిడ్ బెకర్ అంతర్జాతీయ ఆటగాళ్లకు, క్రికెట్ బోర్డులకు శుక్రవారం మెమో పంపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలక మండలి సమావేశం నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన జట్టు సభ్యులు ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లతో కలిసి శుక్రవారం బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ను కలిశారు. ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి ఏడు రోజుల ముందే బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ మొదలై, జట్టు వెళ్లిపోయే ముందు ముగుస్తాయి కాబట్టి ఐసిసి విధించిన ఆంక్షలపై వారు చర్చను కోరుతున్నారు. ఈ ఎండార్స్ మెంట్ లకు కూడా బెకర్ మెమో వర్తిస్తుంది. ఇది తమకు అడ్డంకిగా మారడంతో శశాంక్ మనోహర్ తో వారు చర్చించాలని అనుకుంటున్నారు. #13;