కోల్కత్తా: సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ మరోసారి విజృంభించింది. ఈడెన్ గార్డెన్స్లో గంభీర్సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా ఆరో గెలుపుతో ప్లేఆఫ్కు దగ్గరవగా, ఏడో ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
యూసుఫ్ పఠాన్ 42 పరుగులతో విజృంభించగా, చావ్లా (4/32) మెరుపులు తోడవడంతో కోల్కతా 13 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్పై నెగ్గింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్లో కోల్కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
కెప్టెన్ గంభీర్ 12 పరుగులకే పెవిలియన్కు చేరుకున్నా. మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప 32 పరుగులతో రాణించాడు. అనంతరం 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేసింది.
ఓపెనర్లు మనోజ్ తివారి-శ్రేయాస్ అయ్యర్ తొలి వికెట్కు 63 పరుగులు జోడించారు. తర్వాత ఒకే ఓవర్లో జాదవ్ (10), యువీ (0)ని అవుట్ చేసిన పియూష్ చావ్లా ఢిల్లీకి అదిరిపోయే షాకిచ్చాడు. తర్వాత కెప్టెన్ జేపీ డుమినీ 25 పరుగులకే పెవిలియన్కు చేరాడు. విజయానికి ఢిల్లీ చివరి 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఈ దశలో మాథ్యూస్ (22) అవుట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. ఢిల్లీ డేర్ డెవిల్స్లో శ్రేయాస్ అయ్యర్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పియూష్ చావ్లా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.