
1-1తో స్కోరు సమం
ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్లో క్రిస్ అడ్కాక్-గాబ్రియెల్ అడ్కాక్ జోడీ 11-4, 11-9తో వరుస గేముల్లో బోడిన్ ఇసారా-ప్రజక్తా సావంత (అవధ్) జోడీ నెగ్గడంతో చెన్నై 1-1తో స్కోరుని సమం చేసింది.

సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ విజయం
ఇక చెన్నై ట్రంప్ మ్యాచ్గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ 11-7, 5-11, 11-7తో ఆదిత్య జోషిపై గెలవడంతో స్మాషర్స్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

తప్పుకున్న సైనా నెహ్వాల్
ఇక మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్ పీవీ సింధు 11-4, 11-6తో రితూపర్ణ దాస్పై నెగ్గడంతో చెన్నై స్కోరు 4-1కి పెరిగింది. ఈ మ్యాచ్లో అవధ్ తరఫున సైనా నెహ్వాల్ పోటీపడాల్సి ఉన్నా చివరి నిమిషంలో ఆమె తప్పుకుంది.

ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైన అవధ్ వారియర్స్
ఇక అవధ్ వారియర్స్ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకున్న పురుషుల డబుల్స్లో గో వీ షెమ్-మార్కిస్ కిడో 12-10, 11-8తో సుమీత్-కోల్డింగ్పై గెలిచినా అవధ్ ఒక్క పాయింట్ తేడాతో ఓటమిపాలైంది.


Click it and Unblock the Notifications











