పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా గురువారం రోజున భారత్కు రెండు పతకాలు వచ్చాయి. పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం గెలవగా..నీరజ్ చోప్రా జావ్లెన్ త్రోలో సిల్వర్ గెలిచాడు. దీంతో గురువారం భారత్ ఖాతాలో రెండు పతకాలు వచ్చి చేరాయి.
ఇక శుక్రవారం రోజున భారత్ పలు ఈవెంట్లలో పాల్గొననుంది. మహిళల గోల్ఫ్లో దీక్ష దగత్,అదితి అశోక్ పాల్గొంటుండగా, అథ్లెటిక్స్లో మహిళలు 4 X 400 మీటర్ల రిలే రౌండ్ 1లో జ్యోతిక శ్రీదండి, శుభ వెంకటేశన్, విత్య రామ్రాజ్ మరియు పూవమ్మ ఎంఆర్లు పోటీపడుతున్నారు రాత్రి రెజ్లింగ్లో 57కిలో ఫ్రీ స్టయిల్లో కాంస్య పతకం కోసం అమన్ పోట పడుతున్నాడు. వీటన్నిటికీ సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం
