హైదరాబాద్: భారత్ ఏస్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వాని ప్రపంచ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు మైక్ రస్సెల్ను ఓడించి ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు. పంకజ్ ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించడం ఇది 17వ సారి. భారత క్రీడా చరిత్రలోనే ఇలాంటి అరుదైన ఘనతను మరొకరు సాధించలేదు.
ఆదివారం జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ 150-అప్ ఫార్మాట్ ఛాంపియన్షిప్లో పంకజ్ అద్వాని 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) తేడాతో మైక్ రస్సెల్(ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. బెస్ట్ఆఫ్-11 ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అద్వానీ.. తొలి ఫ్రేమ్ను ప్రత్యర్థి రస్సెల్కు చేజార్చుకుని కొంత తడబడ్డాడు.
ఆ తర్వాత రెండో ఫ్రేమ్ను 150-128తో దక్కించుకున్నప్పటికీ... మూడోది చేజారింది. నాలుగో ఫ్రేమ్లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా ఆ తర్వాత చక్కని అవకాశాలు లభించడంతో పంకజ్ ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. వరుస సెట్లలో భారీ తేడాతో పాయింట్లు కొల్లగొడుతూ రస్సెల్కు చెక్పెట్టాడు.
ఇలా వరుసగా ఐదు ఫ్రేమ్లను దక్కించుకున్నాడు. తద్వారా ఏ క్రీడలోనైనా అత్యధిక ప్రపంచ టైటిళ్లు గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా పంకజ్ అద్వాని అరుదైన ఘనత సాధించాడు. గతేడాది బెంగళూరులో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ పంకజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
What. A. Feeling. 17th World 🏆 in 2017 😀😀😀
— Pankaj Advani (@PankajAdvani247) November 12, 2017