న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టలేదు, కోటి ప్రోత్సహకంగా ఇచ్చారు: సానియా

తాను సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఖండించారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: తాను సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఖండించారు. సర్వీసు ట్యాక్స్ సక్రమంగా చెల్లించనందుకు విచారణ కోసం సానియా లేదా ఆమె చార్టెడ్ అకౌంటెండ్ కాని తమ ముందు హాజరుకావాలని సర్వీసు ట్యాక్స్ శాఖ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సానియా మీర్జా తన చార్టర్డ్ అకౌంటెంటు ద్వారా సమాధానం ఇచ్చారు. తాను సర్వీస్ ట్యాక్స్‌ను ఎగొట్టలేదని సానియా మిర్జా స్పష్టంచేశారు. తాను సక్రమంగానే ట్యాక్స్‌ని చెల్లించినట్టు సానియా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఇచ్చిన కోటి రూపాయలు ట్రైనింగ్ ప్రోత్సహకం కింద ఇచ్చినట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు.

ట్రైనింగ్ ప్రోత్సహకంగానే కోటి రూపాయలు

ట్రైనింగ్ ప్రోత్సహకంగానే కోటి రూపాయలు

దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సానియా అధికారులకు సమర్పించినట్టు ఆమె తరుపున చార్టర్డ్ అకౌంటెంటు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయల ట్రైనింగ్ ప్రోత్సహకంగానే సానియా మిర్జా అందుకున్నారని, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా తాను అవి తీసుకోలేదని ఆయన తెలిపారు.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా

2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం సానియా మిర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి కోటి రూపాయలను అందించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్‌ ట్యాక్స్‌ అధికారులు గుర్తించారు.

అధికారులు

అధికారులు

దీంతో ఆ పారితోషికం మొత్తంపై సర్వీస్ ట్యాక్స్ కింద 14.5 శాతం డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ మేరకు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సానియా మిర్జా తరుపున ఆమె ప్రతినిధి సమర్పించిన డాక్యుమెంట్లపై సర్వీసు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఖతార్‌ ఓపెన్‌‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా

ఖతార్‌ ఓపెన్‌‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా

ఇదిలా ఉంటే ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సానియా మీర్జా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా-స్ట్రైకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ 6-4, 6-3తో డబ్రౌస్కి (కెనడా)-జురాక్‌ (క్రొయేషియా) జంటను ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X