ట్రైనింగ్ ప్రోత్సహకంగానే కోటి రూపాయలు
దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సానియా అధికారులకు సమర్పించినట్టు ఆమె తరుపున చార్టర్డ్ అకౌంటెంటు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయల ట్రైనింగ్ ప్రోత్సహకంగానే సానియా మిర్జా అందుకున్నారని, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా తాను అవి తీసుకోలేదని ఆయన తెలిపారు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా
2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం సానియా మిర్జాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించి కోటి రూపాయలను అందించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో నగదు తీసుకుంటూ చేస్తున్న సేవ వాణిజ్య వ్యవహారం కిందికే వస్తుందని సర్వీస్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు.
అధికారులు
దీంతో ఆ పారితోషికం మొత్తంపై సర్వీస్ ట్యాక్స్ కింద 14.5 శాతం డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఈ మేరకు ఆమెకు మంగళవారం సమన్లు జారీ చేసిన అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సానియా మిర్జా తరుపున ఆమె ప్రతినిధి సమర్పించిన డాక్యుమెంట్లపై సర్వీసు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఖతార్ ఓపెన్లో సెమీస్కు దూసుకెళ్లిన సానియా
ఇదిలా ఉంటే ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా-స్ట్రైకోవా (చెక్ రిపబ్లిక్) జోడీ 6-4, 6-3తో డబ్రౌస్కి (కెనడా)-జురాక్ (క్రొయేషియా) జంటను ఓడించింది.