ముంబై: భారత బాక్సర్ విజేందర్ సింగ్ డ్రాగన్ బాక్సర్కు షాకిచ్చాడు. చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ఓడించి విజేతగా నిలిచాడు.
96-93, 95-94, 95-94 తేడాతో జుల్ఫికర్ను ఓడించి భారత సత్తాను మరోసారి చాటాడు. వరుసగా తొమ్మిదోసారి విజయం సాధించి బాక్సింగ్ ఛాంపియన్గా నిరూపించుకున్నాడు.
తొలి ఐదు రౌండ్లలో ఆధిపత్యం ఉన్నా ఆ తర్వాత రెండు రౌండ్లలో విజేందర్ కొంత ఢీలా పడ్డాడు. కానీ చివరి దాకా పోరాడి సంచలన విజయం సాధించాడు. తద్వారా డబ్ల్యుటీవో ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిడ్, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
విజేందర్ గత ఏడాది కెర్రీ హోప్ను ఓడించి తొలి టైటిల్ అందుకున్నాడు. మరోవైపు శనివారమే ప్రొ కెరీర్ ఆరంభించిన మరో స్టార్ బాక్సర్ అఖిల్ కుమార్ కూడా శుభారంభం చేశాడు. అతను గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు.