హైదరాబాద్: ముందుగా ఊహించిందే జరిగింది. భారత్కు చెందిన 'గోల్డెన్ బాయ్' పంకజ్ అద్వానీ మళ్లీ స్వర్ణాన్ని గెలిచి 'టాప్ పెర్ ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 'గా నిలిచాడు.
ఈ ఏడాది విస్తారమైన పతకాలను గెలుచుకున్న అద్వానీ తన గోల్ను చేరుకున్నాననే ఉత్సాహంలో ఉన్నాడు.
బెంగుళూరుకు చెందిన అద్వానీ బిలియార్డ్స్లోనూ, స్నూకర్ గేమ్లోనూ టైటిళ్లను గెలుచుకుని 2017లో తనదైన ముద్ర వేశాడు. మొదటి పతకాన్ని దోహాలో జరిగిన ప్రపంచ స్థాయి బిలియార్డ్స్లో గెలుచుకున్నాడు. ఇందులో రజిత పతకాన్ని సంపాదించుకున్నాడు.
అనంతరం అదే వేదికపై స్నూకర్ క్రీడలో మరో పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 32 ఏళ్ల అద్వానీ ఒకే వేదికపై రెండు పతకాలను గెలుచుకుని మొత్తం ఈ ఏడాది మూడు పతకాలను గెలుచుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.