Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీరజ్ చోప్రా నా కన్న బిడ్డతో సమానం: పతకం కోసం అల్లాను ప్రార్థించా: పాక్ అథ్లెట్ తల్లి

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో మరో పతకం పడింది. పురుషుల జావెలిన్ త్రో కేటగిరీలో రజతాన్న్ని ముద్దాడింది. ఈ విభాగంలో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. వెండి పతకాన్ని అందుకున్నాడు. ఇందులో బంగారు పతకం అనుకున్నప్పటికీ- అది సాధ్యపడలేదు.

గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీం చరిత్ర సృష్టించాడు. ఏకంగా 90 మీటర్లకు పైగా బల్లేన్ని సంధించాడు. నదీం సంధించిన ఈటె 92.97 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో అతనికి ఇదే తొలి బంగారు పతకం. జావెలిన్ త్రోలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ కూడా.

Neeraj Chopra is like my son says Arshad Nadeem s mother Razia Parveen

ఈ కేటగిరీలో నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం పాటు బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్ 88.54 మీటర్ల దూరం ఈటెను సంధించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే వరుసగా రెండు పతకాలను సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో అతను గోల్డ్ మెడల్ అందుకున్న విషయం తెలిసిందే.

క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈటెను అందరి కన్నా ఎక్కువ దూరం విసిరి గోల్డ్ మెడల్ అంచనాలు పెంచాడు నీరజ్ చోప్రా. ఫైనల్‌లో తడబడ్డాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. అదే అతనికి రజత పతకాన్ని ఖాయం చేసింది. ఆ తరువాతి నాలుగు ప్రయత్నాల్లో ఆ స్థాయిలో బల్లేన్ని విసరలేకపోయాడు.

అదే సమయంలో అర్షద్ నదీమ్ చెలరేగాడు. 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్స్‌లో 89 మీటర్లు కూడా విసరని నదీమ్.. ఫైనల్లో మాత్రం కమ్ బ్యాక్ అయ్యాడు. రెండు సార్లు ఈటెను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరగలిగాడు.

నీరజ్ చోప్రా వెండి పతకంతో సరిపెట్టుకోవడం పట్ల అతని తల్లి సరోజ్ దేవి స్పందించారు. రజత పతకం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. వెండి కూడా బంగారంతో సమానమని వ్యాఖ్యానించారు. అర్షద్ నదీం కూడా తనకు కొడుకు లాంటివాడేనని ఆనందంతో చెప్పారు. ఒలింపిక్స్‌కు నీరజ్ చోప్రా గాయపడ్డాడని గుర్తుచేశారు.

దీనికి ప్రతిగా అర్షద్ నదీం తల్లి రజియా పర్వీన్ సైతం స్పందించారు. నీరజ్ చోప్రాను తన కన్నకొడుకుగా అభివర్ణించారు. అర్షద్ నదీం పతకం సాధించాలని తాను అల్లాను ప్రార్థించానని అన్నారు. తన కొడుకు నదీంకు ప్రాణ స్నేహితుడు మాత్రమే కాకుండా తమ్ముడిలాంటోడని పేర్కొన్నారు. నీరజ్ చోప్రాకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటన్నట్లు చెప్పారు.

Story first published: Friday, August 9, 2024, 16:55 [IST]
Other articles published on Aug 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+