లండన్: మామూలుగానే ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలకు నోటి దురద ఎక్కువ. ఏదో ఒక వివాదం చేసి ప్రత్యర్థి ఆటగాళ్ల మానసిక స్థయర్యం దెబ్బతీయడం వారి నైజం. ఇంగ్లండ్ లో భారత క్రికెట్ జట్టు పర్యటన మొదలైనప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ భారత ఫీల్డర్లపై పరుష పదజాలం ప్రయోగించాడు. బుధవారం జరిగిన టి20 మ్యాచ్ లో కొందరు టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ విషయంలో గాడిదల్లా వ్యవహరించారన్నాడు. ఇదివరకే హుస్సేన్, రవిశాస్త్రి మధ్య రివ్యూల అంశంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈసారి మాత్రం నాసిర్ వ్యాఖ్యలకు శాస్త్రి స్పందించలేదు. అంతకుముందు మరో మాజీ సారథి మైకేల్ వాన్ భారత బ్యాట్స్ మన్ లక్ష్మణ్ పై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. హాట్ స్పాట్ నుంచి తప్పించుకోవడానికి లక్ష్మణ్ తన బ్యాట్ కు వేసలిన్ రాస్తున్నాడని వాన్ ఆరోపించాడు. #13;