For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరణం మల్లీశ్వరి తర్వాత ఇన్నాళ్లకు: వెయిట్‌ లిఫ్టింగ్‌‌లో స్వర్ణం గెలిచిన చాను

By Nageshwara Rao
Mirabai Chanu lifts 194 kgs to win gold medal at 2017 World Weightlifting Championships, watch video

హైదరాబాద్: కాలిఫోర్నియాలోని అనాహిమ్‌ పట్టణంలో జరుగుతోన్న ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ బంగారు పతకం సాధించింది. 48 కేజీల విభాగంలో పాల్గొన్న 23 ఏళ్ల చాను మొత్తం 194 (స్నాచ్‌ 85, క్లీన్‌అండ్‌ జెర్క్‌-109)కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు సృష్టించింది.

తద్వారా భారత్‌కు చెందిన మీరాబాయ్‌ చాను స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అంతేకాదు కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో క్రీడాకారిణిగా చాను అరుదైన ఘనత సాధించింది. 1994, 1995లో కరణం మల్లీశ్వరి స్వర్ణం సాధించింది.

ఇక థాయ్‌లాండ్‌, కొలంబియాకు చెందిన క్రీడాకారిణీలు రజతం, కాంస్య పతకాలు సాధించారు. పసిడి పతకం అందుకునేందుకు పోడియం వద్దకు వెళ్లిన సమయంలో చాను కాస్తంత ఉద్వేగానికి లోనైంది. మణిపూర్‌కు చెందిన చాను గతేడాది రియో ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించింది.

అయితే పైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మీరాబాయ్‌ చానుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాధోడ్ ఆమెను ట్విట్టర్‌లో ప్రత్యేకంగా అభినందించారు.

Story first published: Thursday, November 30, 2017, 13:58 [IST]
Other articles published on Nov 30, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+