ముంబై: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ కెప్టెన్ మష్రాఫే మొర్తాజా కారులో కాకుండా సైకిల్ రిక్షాపై ప్రయాణించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సైకిల్ రిక్షాపై ప్రయాణిస్తూ ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. భారత్తో సిరీస్ నేపథ్యంలో శిక్షణ కోసం సైకిల్పై వెళ్తుండగా బస్సు ఢీకొని అతను ప్రమాదానికి గురయ్యాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆయనకు కారు ఇవ్వలేదనే విషయం నిజమే. అయితే, ఆయకు సొంత కారు ఉంది. ఆ కారులో రాకుండా ఆయన సైకిల్పై ప్రయాణించడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. మొర్తాజా భార్య పిల్లలను చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకుందని, దాంతో అతను కారు వదిలేసి సైకిల్పై రావడానికి పూనుకున్నాడని జట్టు ఫిజిషియన్ డాక్టర్ దేబశీష్ చౌదరి చెప్పారు.
మొర్తాజాకు స్వల్పంగా మాత్రమే గాయాలు అయ్యాయని, మైదానంలోనే ఆయనకు చికిత్స అందించామని, జట్టుకు నాయకత్వం వహించగలడనే నమ్మకం ఉందని చౌధరి అన్నారు. మొర్తాజాకు రెండు కార్లు, ఓ బైక్ ఉన్నాయి.
మొర్తాజా ఇంటికి మైదానం చాలా సమీపంలో ఉంది, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కారు తీయకుండా సైకిల్పై రావాలని అనుకున్నట్లు జాతీయ సెలెక్టర్ ఫరూక్ అహ్మద్ చెప్పారు. 2011 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా జట్టు సభ్యులకు బంగ్లాదేశ్లో ప్రారంభోత్సవం సందర్భంగా సైకిల్ రిక్షాలు ఇచ్చారు.