హైదరాబాద్: భారత యువ షూటర్ మను బాకర్ ఒలింపిక్కు అర్హత సాధించింది. మ్యూనిచ్ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ నాలుగో స్థానంలో నిలిచి టోక్యో బెర్తు దక్కించుకుంది. దీంతో భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఏడో షూటర్గా మను బాకర్ నిలిచింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ పోటీల్లో మను బాకర్ 201.0 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. గ్రీస్కు చెందిన అన్నా కోరకకి(241.4), చైనాకు చెందిన వీ క్వీన్(239.6), కొరియాకు చెందిన మిన్జుంగ్ కిమ్(220.8) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో ఇది వరకే సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ ఒలింపిక్స్ కోటా సాధించిన సంగతి తెలిసిందే.