లండన్: కరోనా వైరస్ మహమ్మారి సామాన్యులనే కాదు సెలబ్రిలను సైతం వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, నటీనటులు, క్రీడాకారులు, బడా వ్యాపావేత్తలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆదివారం బహ్రెయిన్లో జరిగిన 11వ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న హామిల్టన్కు కరోనా సోకడంతో అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
లూయిస్ హామిల్టన్కు స్వల్ప వైరస్ లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని మెర్సిడెజ్ ఏఎంసీ పెట్రొనాస్ టీం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఏడుసార్లు ఎఫ్ 1 చాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన హామిల్టన్.. త్వరలో జరిగే సాఖిర్ గ్రాండ్ ప్రికి దూరమవుతున్నట్లు టీమ్ వెల్లడించింది. గత వారంలో హామిల్టన్కు మూడుసార్లు వైరస్ పరీక్షలు నిర్వహించినా.. ప్రతిసారీ నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు టీమ్ చెప్పింది.
హామిల్టన్ ఆదివారం బహ్రెయిన్ గ్రాండ్ ప్రి కూడా గెలిచాడు. అయితే సోమవారం ఉదయమే అతనికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని టీమ్ తెలిపింది. ఆ తర్వాత కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్గా తెలింది. దీంతో హామిల్టన్ ప్రస్తుతం బహ్రెయిన్లోనే ఐసొలేషన్లో ఉన్నాడు. స్వల్ప లక్షణాలు మినహాయించి.. అతడు ఫిట్గా ఉన్నట్లు టీమ్ ఆ ప్రకటనలో తెలిపింది.
క్రికెటర్లు కూడా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లకు వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10కి చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ వదిలి ప్రాక్టీస్ చేయడానికి వెళ్లకుండా కివీస్ బోర్డు ఆంక్షలు విధించింది. పాక్ ఆటగాళ్లు బయో సెక్యూర్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారని ఇప్పటికే క్రికెట్ న్యూజిలాండ్ ఆరోపిస్తోంది.
గర్భవతిగా ఉన్నా కూడా అనుష్క శర్మ సాహసం.. కోహ్లీతో కలిసి!!