
హైదరాబాద్: తన కెరీర్లో 18వ ప్రపంచ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పంకజ్ అద్వానీకి నిరాశ ఎదురైంది. దోహా వేదికగా జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ (లాంగ్ అప్ ఫార్మాట్)లో పంకజ్ పోరాటం సెమీ ఫైనల్స్లోనే ముగిసింది.
బుధవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 620-1250 పాయింట్లతో మైక్ రసెల్ (ఇంగ్లండ్) చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో పంకజ్కు కాంస్యం లభించింది. గతవారం ఇదే వేదికపై జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ (పాయింట్ల ఫార్మాట్) ఛాంపియన్షిప్లో పంకజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
విజేతల వివరాలివే:
150-Up (Points Format):
GOLD: Pankaj Advani (India); SILVER: Mike Russell (England); Joint Bronze: Rupesh Shah (India); Peter Gilchrist (Singapore)
Long-Up (Time Format):
GOLD: Mike Russell (England); SILVER: Robert Hall (England); Joint Bronze: Pankaj Advani (India); Nay Thway Oo (Myanmar)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.