హైదరాబాద్: బీజింగ్ వేదికగా జరుగుతున్న షూటింగ్ వరల్డ్కప్లో గురువారం భారత్ షూటర్లు రెండు స్వర్ణాలు సాధించారు. టోర్నీలో భాగంగా 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్లో భారత్కు చెందిన మను బాకర్, సౌరభ్ చౌదరి జోడీ స్వర్ణ పతకాలతో మెరిశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
టీమ్ ఫైనల్లో 16-6 స్కోర్ మెరిసి స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో చైనాకు చెందిన జియాంగ్ రాక్సిన్, పాంగ్ వీలకు గట్టి షాకిచ్చారు. క్వాలిఫయింగ్ రౌండ్లో 482 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచిన మను బాకర్, సౌరభ్ చౌదరిల జోడీ ఫైనల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశారు.
ఈసారి ఫైనల్స్ను కొత్త ఫార్మాట్లో నిర్వహించారు. టాప్లో నిలిచిన టీమ్స్కు హెడ్ టు హెడ్ ఫార్మాట్లో ఈవెంట్ను నిర్వహించారు. కాగా, అంతకముందు మిక్సిడ్ ఈవెంట్లోనూ భారత్ స్వర్ణ పతకం వచ్చింది. అంజుమ్ మౌద్గిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్లు 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం సాధించారు. చివరి షాట్లో 20.6 పాయింట్ల సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.