
ఫెడ్ కప్: మంత్రుల షేక్ హ్యాండ్స్, సానియా కెప్టెన్
మహిళల ఈవెంట్లలో అతి పెద్ద టోర్నమెంట్ అయిన ఫెడ్ కప్కు ఈ సారి మన భాగ్యనగరం తొలిసారి ఆతిథ్యం ఇస్తుంది.

ఫెడ్ కప్: మంత్రుల షేక్ హ్యాండ్స్, సానియా కెప్టెన్
ఈ టోర్నమెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారక రామారావు, క్రీడల శాఖ మంత్రి పద్మారావు చేతుల మీదుగా మంగళవారం ఘనంగా ఈ టోర్నీ ప్రారంభమైంది.

ఫెడ్ కప్: మంత్రుల షేక్ హ్యాండ్స్, సానియా కెప్టెన్
ఈ సందర్భంగా టోర్నీలో పాల్గొంటున్న వివిధ దేశాల ఆటగాళ్లను మంత్రులు పరిచయం చేసుకున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు ఈనెల 18 వరకు ఎల్బీ స్టేడియంలో జరుగుతాయి.

ఫెడ్ కప్: మంత్రుల షేక్ హ్యాండ్స్, సానియా కెప్టెన్
ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నమెంట్లో భారత జట్టుకు వరల్డ్ నంబర్వన్ డబుల్స్ క్రీడాకారిణి, హైదరాబాదీ ఏస్ సానియా మీర్జా నాయకత్వం వహిస్తుంది.

ఫెడ్ కప్: మంత్రుల షేక్ హ్యాండ్స్, సానియా కెప్టెన్
భారత జట్టు బుధవారం నుంచి బరిలోకి దిగనుంది. ఈ టోర్నమెంట్లో భారత్తో పాటు మలేసియా, పాకిస్ధాన్, ఫిలిప్పేన్స్, సింగపూర్, తుర్క్ మెనిస్తాన్, కిర్గిస్తాన్, ఇరాన్, ఇండోనేషియా, శ్రీలంక, ఫసిఫిక్ ఓషియానియా దేశాల జట్లు పాల్గొంటున్నాయి. చివరి నిమిషంలో ఇరాక్ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో బరిలో మొత్తం 11 జట్లు నిలిచాయి.

ఫెడ్ కప్: మంత్రుల షేక్ హ్యాండ్స్, సానియా కెప్టెన్
అనంతరం జరిగిన మ్యాచ్లో ఇండోనేషియా, మలేషియా జట్లు శుభారంభం చేశాయి. ఓషియానాను ఓడించగా, పూల్ సీలో పాకిస్థాన్పై మలేషియా విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచే జట్టు 2016లో జరిగే ఆసియా/ఓషియానియా గ్రూప్ 1 పోటీలకు అర్హత సాధిస్తుంది. సానియా నాయకత్వం వహిస్తున్న భారత జట్టులో అంకితా రైనా, ప్రార్థనా తోంబరే, నటాషా పల్హా ఇతర సభ్యులుగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











