
జకార్తా: భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. వరుసగా మూడో సారి ఆసియా క్రీడల ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్లో చైనీస్ తైపీని 27-14 తేడాతో చిత్తుగా ఓడించింది. గత రెండు పర్యాయాల్లో ఆసియా క్రీడల విజేత భారతే కావడం గమనార్హం. 2012, 2013, 2014లో కబడ్డీ ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టుకు ప్రస్తుత క్రీడల్లో ఎదురేలేదు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించింది. ప్రతిష్టాత్మక క్రీడా సంరంభం ఆసియా గేమ్స్లో భాగంగా జరుగుతోన్న పోటీలో భారత మహిళల జట్టు ఫైనల్కు చేరింది. ఇప్పటికే భారత్ 3 సార్లు ఫైనల్ చేరి వరల్డ్ కప్ అందుకుంది. 2012, 2013, 2014లలో విజేతగా నిలిచిన భారత్ ఈ సారి ఫైనల్లో ఇరాన్.. థాయ్లాండ్లలో ఒకరితో పోటీపడనుంది.
పురుషుల కబడ్డీ ఈవెంట్లో ఏడు సార్లు స్వర్ణ విజేత అయిన భారత జట్టు గురువారం జరగనున్న సెమీ ఫైనల్స్లో ఇరాన్ జట్టుతో పోటీ పడుతుంది.