

జకార్తా: ప్రతిష్టాత్మక క్రీడా సంరంభం ఆసియా గేమ్స్లో భారత్ పతకాల పంట పండుతోంది. 400 మీటర్లు రిలే ఈవెంట్లో పురుషుల జట్టు.. మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేశాయి. ఇంకా ఇదే విభాగంలో మహిళల ఈవెంట్లో హిమదాస్, మాచెట్టిరా పోవమ్మా, సరితామెన్ లక్ష్మణ్భాయ్ గైక్వార్డ్, వెల్లువ కొరొత్ విస్మయలు అద్భుతంగా ఆడి భారత్ కు స్వర్ణాన్ని అందించారు. దీంతో భారత్కు ఈ పోటీల్లో పాల్గొనే ఆఖరి రోజును రెండు స్వర్ణంతో ముగించారు.
పురుషుల జట్టులో మొహమ్మద్ కున్హు, ధరుణ్ అయ్యసామి, మొహమ్మద్ అనాస్, రాజీవ్ అరోకియాలు అద్భుతంగా ప్రదర్శించి భారత్కు రజతం అందేలా చేశారు. ఇంతకుముందు జిన్సన్ జాన్సన్ 1500మీ పరుగు పందెంలో పాల్గొని గురువారం భారత్కు తొలి స్వర్ణాన్ని అందించాడు.