న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు షూటర్లు తొలి పతకం సాధించి పెట్టారు. శనివారం జరిగిన 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో భారత షూటర్లు రజత పతకం సాధించారు. గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, సంజీవ్ రాజపూత్ లతో కూడిన టీమ్ ఈ పతకం సాధించింది. చైనాకు స్వర్ణ పతకం లభించింది. మహిళా 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ పోటీల్లో భారత క్రీడాకారులు ఐదో స్థానంలో నిలిచారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో నవ్యమాన్ ఓంకార్ సింగ్ ఫైనల్ కు అర్హత సాధించాడు.