క్రైస్ట్ చర్చ్ :స్థానిక ఏఎంఐ మైదానంలో జరిగిన మూడో వన్డేలో న్యూజీలాండ్ పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యం సాధంచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 392 పరుగులు సాధించి 393 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందువుంచింది. అయితే న్యూజిలాండ్ 334 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో 392 పరుగులు సాధింది. సచిన్ (163), యువరాజ్ సింగ్ (87), ఎంఎస్ ధోని(68)లు వీర విహారం చేసి కివీస్ ముందు 393 పరుగల భారీ లక్ష్యాన్ని ఉంచారు.భారత బౌలర్లు జహీర్ ఖాన్ , యువరాజ్ సింగ్ , హర్భజన్ లు చెరో రెండు వికెట్లు సాధించగా కుమార్ , యూసఫ్ పఠాన్ లు చెరో వికెట్ తీసుకున్నారు.