For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 516

By Staff
India
మొహాలి: మొహాలిలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆస్ట్రేలియా ముందు 516 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు సోమవారం టీ విరామ సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. మూడు వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి భారత్ తన రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్సు ఆధిక్యతతో కలుపుకొని భారత్ ఆసీస్ ముందు 516 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 68 పరుగులతో మహేంద్ర సింగ్ ధోనీ, పది పరుగులతో టెండూల్కర్ నాటవుట్ గా ఉన్నారు. గంభీర్, సెహ్వాగ్ భారత్ రెండో ఇన్నింగ్సులో శుభారంభాన్ని అందించారు. సెహ్వాగ్ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిడిల్ బౌలింగ్ లో హాడిన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా గంభీర్ తన సెంచరీని పూర్తి చేసుకున్నారు. గంభీర్ 104 పరుగులు చేసి వైట్ బౌలింగులో హస్సీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం గంగూలీ 27 పరుగులు చేసి బ్రెట్ లీ బౌలింగులో క్లార్క్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు దారి తీశాడు.

ఆస్ట్రేలియాకు ఫాలో ఆన్ ఇవ్వకుండా భారత్ తన రెండో ఇన్నింగ్సును ఆదివారం సాయంత్రం ప్రారంభించింది. మిశ్రా బౌలింగుకు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా వంద పరుగులు చేసింది. భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా 268 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ 201 పరుగుల ఆధిక్యంలో ఉంది. అమిత్‌ మిశ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌, హర్భజన్‌ చెరో రెండు వికెట్లు, జహీర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌గా ఆదివారం ఉదయం క్రీజులోకి వచ్చిన క్లార్క్ (27) అమిత్ మిశ్రా ఎల్బీడబ్ల్యూ రూపంలో, హస్సీ (54)ని ఇశాంత్ శర్మ కీపర్ క్యాచ్ ద్వారా, హాడిన్ (9)ను క్లీన్ బౌల్డ్ ద్వారా హర్భజన్ పెవిలియన్ బాట పట్టించారు. వాట్సన్, బ్రెట్ లీ ఫాలో ఆన్ ప్రమాదం నుంచి ఆస్ట్రేలియాను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వారు భారత బౌలర్లను స్థిరంగా ఎదుర్కున్నారు. వాట్సన్ 78 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగులో అవుటయ్యాడు. బ్రెట్ లీ 35 పరుగులు చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 469 పరుగుల భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ (102), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (92), సచిన్ టెండూల్కర్ (88), గంభీర్ (67), సెహ్వాగ్ (35), ద్రావిడ్ (39)లు రాణించడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యపడింది. ఆసీస్ బౌలర్లలో సిడిల్, జాన్సన్‌లు మూడేసి వికెట్లు పడగొట్టగా, వైట్ రెండు, బ్రెట్ లీ ఓ వికెట్ దక్కించుకున్నారు. జహీర్ ఖాన్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
Story first published: Monday, October 20, 2008, 14:29 [IST]
Other articles published on Oct 20, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+