
జకార్తా: ఆసియా గేమ్స్లోని మూడో రోజైన మంగళవారం భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. సాధించిన మూడు పతకాలు షూటింగ్ విభాగంలోనే కావడం గమనార్హం. ఎయిర్ పిస్టల్ విభాగంలో.. 16 ఏళ్ల సౌరభ్ చౌదరీ స్వర్ణం సాధించగా.. అభిషేక్ వర్మ రెండో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు వీరితో పాటుగా 50 మీటర్ల విభాగంలో 3 స్థానాల్లో రైఫిల్ షూటింగ్ చేసిన సంజీవ్ రాజ్పుత్ రజిత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
అర్జున అవార్డు గ్రహీత అయిన రాజ్పుత్ కేవలం 0.4 పాయింట్ల వ్యత్యాసంతో స్వర్ణాన్ని కోల్పోయాడు. ఫైనల్స్ ఆరంభంలో కాస్త తడబడిన సంజీవ్ సహనంతో సాధించి ఎట్టకేలకు రజితాన్ని దక్కించుకున్నాడు.
దీంతో భారత్ ఖాతాలో ఎనిమిది పతకాలు చేరాయి. ఈ పోటీలో టాప్ 3 నిలిచిన వాళ్లు జీయ్ చింగ్ హుయ్ 453.3 పాయింట్లు.. సంజీవ్ రాజ్పుత్ 452.7 పాయింట్లు.. మాత్సుమాటో తాకయుకీ 441.4 పాయింట్లు సాధించారు. సోమవారం పోటీలు ముగిసే సమయానికి భారత సెపక్ తక్రా జట్టు ఫైనల్కు అర్హత సాధించడంతో ఇప్పటికే మరో పతకం ఖాయం చేసేసుకుంది భారత్.