జకార్తా: ఆసియా గేమ్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లో భారత్ పతకాల పంట పండిస్తున్నది. జావెలిన్ త్రోలో భారత్కు స్వర్ణం దక్కింది. ఆసియా గేమ్స్లో భారత్పై సోమవారం కురుస్తోన్న రజత పతకాల వర్షాన్ని చేదిస్తూ స్వర్ణంతో మెరిశాడు నీరజ్ చోప్రా. మెన్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో 8వ స్వర్ణం చేరింది. నీరజ్ చోప్రా.. జావెలిన్ను 88.06 మీటర్ల దూరం విసిరాడు. అత్యద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్.. అతని రికార్డు అతనే కాదు.. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు.
జావెలిన్ త్రో విభాగంలో ఆసియా గేమ్స్లో తొలి స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. నీరజ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఆ ఘనతకు నిదర్శనంగానే నీరజ్ చోప్రా ఆసియా క్రీడల ఆరంభోత్సవంలో పతకదారిగా కవాతులో పాల్గొన్నాడు.