ఢిల్లీ: భారతీయులకు శుభవార్త! రియో ఒలింపిక్స్లో భారత్ ఎనిమిది బంగారు పతకాలను గెలుచుకుంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మన్ సాచ్స్ జోస్యం చెప్పింది. రియో ఒలింపిక్స్ ఆగస్టు 5న ప్రారంభం కానున్నాయి.
రియో: కనీసం కుర్చీకూడా లేదు, హాకీ టీం ఇక్కట్లు
2012 లండన్ ఒలింపిక్స్ సమయంలోను గోల్డ్మన్ జోస్యం చెప్పింది. భారత్ ఐదు స్వర్ణాలు గెలుచుకుంటుందని చెప్పింది. అయితే, భారత్ ఆ సమయంలో ఆరు బంగారు పతకాలు గెలుచుకుంది. రెండు సిల్వర్, నాలుగు కాంస్య పతకాలు గెలుచుకుంది. ఈసారి 8 బంగారు పతకాలు గెలుస్తుందని జోస్యం చెప్పింది.

బయలుదేరిన జ్వాలా, గోపీచంద్
బ్యాడ్మింటన్ శిక్షకుడు పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణి గుత్తా జ్వాల రియో ఒలింపిక్స్కు బయలుదేరి వెళ్లారు. సైనా, సింధూతో పాటు ఒలింపిక్స్కు ఎంపికైన ఆరుగురు క్రీడాకారులు రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ పొందారని గోపీచంద్ చెప్పారు.
మన క్రీడాకారులు రియోలో పతకాలు సాధించడమే లక్ష్యంగా పోటీలకు సిద్దమైనట్లు ఆయన చెప్పారు. ఈసారి ఒలింపిక్స్ తప్పకుండా పతకాలు సాధిస్తారన్నారు.శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ బృందం దుబాయ్, సోహార్ మీదుగా రియో వెళ్తున్నారు.