హైదరాబాద్: భారత బాక్సింగ్లో ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది. 2021లో నిర్వహించనున్న పురుషుల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు భారత్ వేదికగా జరగనున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) ప్రకటించింది.
ఈ పోటీలను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై రెండు రోజులుగా మాస్కోలో ఏఐబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించింది. ఈ చర్చల అనంతరం భారత్లో నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇవ్వడం భారత్కి ఇదే తొలిసారి.

2019లో సోచిలో పురుషుల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ కుయో వు తెలిపారు. ఆ తర్వాత 2021లో పురుషుల ఛాంపియన్షిప్ కూడా భారత్లోనే జరగనుంది. ఇక 2018లో మహిళల వరల్డ్ ఛాంపియన్షిప్ను భారత్ ఆతిథ్యమివ్వనుంది.