హైదరాబాద్: బీజింగ్ ఒలింపిక్స్లో భారత్కు షూటింగ్ విభాగంలో బంగారు పతకాన్ని తెచ్చిపెట్టిన అభినవ్ బింద్రా ఈ విధంగా అన్నారు. 2020 ఒలింపిక్షలో భారత్కు షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని తెచ్చే ఘనత చాలా మందికి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ గొప్పదనాన్ని ఏ ఒక్కరికో ఆపాదించడం సరికాదన్నారు.
బుధవారం మధ్యప్రదేశ్లో షూటింగ్ అకాడమీని బింద్రా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధుల్లో ఒకరు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలను తెచ్చే సత్తా చాలా మందికి ఉందన్నారు.
My compliments to @yashodhararaje for being a visionary sports minister. She has singularly set up the best program run by any state in the country. Best wishes for sustained success.
— Abhinav Bindra (@Abhinav_Bindra) December 6, 2017
తాను సభ్యుడిగా ఉన్న 2020 ఒలింపిక్ టాస్క్పోర్స్ రెండు నెలల కిందటే క్రీడా మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించిందని చెప్పాడు. మధ్యప్రదేశ్లోని షూటింగ్ అకాడమీకి కావాల్సిన పరికరాలను అంతర్జాతీయ క్రీడా సమితి (ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్) సమకూర్చింది.