న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలి రోజు సోమవారం శుభారంభం చేసింది. టెన్నిస్ విభాగంలో రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. సోమవారం ఉదయం ఉగాండా ఆటగాడు రాబర్ట్ బయింజాతో జరిగిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించాడు. 6-1, 6-4తో బోపన్న రాబర్ట్ పై సునాయాసంగా నెగ్గాడు. కాగా, టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ శ్రీలంకను 3-0 స్కోరుతో ఓడించింది. కామన్వెల్త్ క్రీడల్లో ఈ ఉదయం జరిగిన మహిళల 200 మీటర్ల స్విమ్మింగ్ ఫ్రీస్త్టెల్ విభాగంలో భారత్ విజయం సాధించింది. 19 ఏళ్ల భారత స్విమ్మర్ ఆర్తి భజరంగ్ మొదటి రౌండ్ లో నెగ్గింది. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ సోమవారం సాయంత్రం తన సత్తాను చాటనుంది.