సౌతాంప్టన్ : భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ను 23 ఓవర్లకు కుదించారు. ఉదయం నుంచి భారీ వర్షం పడడంతో పిచ్ చిత్తడిగా మారింది. దీంతో నిర్ణీత సమయంలో ఆట ప్రారంభించడం వీలు కాలేదు. అంపైర్లు పలుసార్లు మైదానాన్ని సమీక్షించినా ఫలితం లేకుండా పోయింది. మధ్యలో ఒకసారి వర్షం ఆగిపోవడంతో ఆటను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఈ సమయంలో మళ్లి వర్షం రావడంతో అంపైర్లు ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. ఏక ధాటిగా కురిసిన వర్షం సాయంత్రం తగ్గు ముఖం పట్టింది. దీంతో 23 ఓవర్ల చొప్పున మ్యాచ్ ను నిర్వహించాలని నిర్ణయించారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకొంది. ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ స్థానంలో మనోజ్ తివారీ జట్టులోకి వచ్చాడు.రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయానికి 23 ఓవర్లలో 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక విజయాన్ని రుచి చూపించాల్సిన బాధ్యత బౌలర్లదే. రహానే నిలకడగా ఆడి అర్ధసెంచరీ సాధించడంతో పాటు... రైనా మెరుపు వేగంతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించడంతో... భారత జట్టు 23 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.రోజ్ బౌల్ లో జరుగుతున్న రెండో వన్డేను వర్షం కారణంగా 23 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత యువ ఓపెనర్ రహానే (47 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి రాణించి అర్ధసెంచరీ సాధించగా... పార్థీ వ్ పటేల్ (18 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ద్రవిడ్ (31 బంతుల్లో 32; 2 ఫోర్లు) మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్ ను స్థిరపరిచాడు. ఇక స్లాగ్ ఓవర్లలో రైనా (19 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్వాన్, బ్రెస్నన్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.తొలి ఓవర్లో రెండు బౌండరీలతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పార్థీవ్ పటేల్ బ్రెస్నన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. పార్థీవ్ దూకుడుగా ఆడటంతో భారత్ మూడు ఓవర్లలోనే 29 పరుగులు చేసింది. కానీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అండర్సన్ బౌలింగ్ లో పార్థీవ్ పటేల్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రీప్లేలో ఇది నాటౌట్ గా తేలింది. హాట్ స్పాట్ లో బంతి ఎక్కడా బ్యాట్ కు తగిలినట్లు కనిపించలేదు. ద్రవిడ్ తన శైలిలో ఆచితూచి ఆడుతూ సింగిల్స్ తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. రెండో ఎండ్ లో రహానే మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్ బౌలింగ్ లో డీప్ స్క్వేర్ లెగ్ లోకి కళ్లుచెదిరే సిక్సర్ కొట్టిన ఓపెనర్... సమయస్ఫూర్తితో ఆడాడు. ద్రవిడ్, రహానే కలిసి రెండో వికెట్ కు 79 పరుగులు జోడించాక... ద్రవిడ్ అవుటయ్యాడు. కోహ్లి కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. రహానే 40 బంతుల్లో తొలి అంతర్జాతీయ వన్డే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.కండరాల నొప్పితో బాధపడ్డ రహానే అవుటయ్యాక రైనా షో మొదలైంది. డెర్న్ బాచ్ బౌలింగ్ లో రెండు అద్భుతమైన సిక్సర్లు బాదిన రైనా వేగంగా ఆడాడు. కెప్టెన్ ధోని భారీ షాట్ కు వెళ్లి అవుటవడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రెస్నన్ బౌలింగ్ లో రైనా కవర్స్ లోకి కళ్లుచెదిరే సిక్సర్ కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మరోసారి భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివర్లో బెల్ అద్భుతమైన క్యాచ్ తో మనోజ్ తివారీ కూడా వెనుతిరిగాడు.