న్యూఢిల్లీ: తనకు టైటిల్ అవసరం లేదని, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు వద్దని బాక్సింగ్ ఛాంపియన్ విజేందర్ సింగ్ అన్నారు. డోక్లామ్ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్ఠంభన దృష్ట్యా తన టైటిల్ను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
ముంబైలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ఓడించి, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.

అనంతరం విజేందర్ మాట్లాడారు. డోక్లామ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నానని, ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఈ సందేశం ఇస్తున్నానని, తన టైటిల్ను ఇచ్చేందుకు సిద్ధమని, ఇది చైనా ప్రజలకు, అక్కడి మీడియాకు చేరుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.