హైదరాబాద్: అర్జున అవార్డులపై మరో క్రీడాకారుడు తన నిరాశను వ్యక్తం చేశాడు. మూడోసారి కూడా ఈ అవార్డు కోసం తనను విస్మరించడంపై భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన హరీందర్ పాల్ సంధూ ఈ సందర్భంగా మాట్లాడాడు. 'ఈసారి కచ్చితంగా నా పేరు జాబితాలో ఉంటుందని భావించాను. అయితే అర్హత ఉన్నప్పటికీ నన్ను పరిగణనలోకి తీసుకోకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది' అని అన్నాడు.

తనకు సహచర ఆటగాడు సౌరవ్ ఘోషాల్కు మద్దతు తెలుపుతూ 2014లోనే అతడికి అర్జున రావాల్సిందని అన్నాడు. అయితే సంధూ టీమ్ ఈవెంట్స్లో కీలకంగా ఉన్నప్పటికీ... వ్యక్తిగత విభాగంలో ఆసియా, కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించడంలో విఫలమయ్యాడు.