మొహాలీ: బాలీవుడ్ నటి ప్రీతి జింటా చేతి నుంచి ఐపియల్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టును హీరో హోండా కొనుగోలు చేసింది. ప్రీతి జింటా నుంచి ఈ జట్టును హీరో హోండా 260 మిలియన్ అమెరికా డాలర్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యజమానులుగా ఇప్పటి వరకు ప్రీతి జింటా, నెస్ వాడియా, మోహిత్ బర్మన్, కరన్ పాల్ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు చేతులు మారుతూ మంగళవారం రాత్రి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఐపియల్ జట్టును పూర్తిగా అమ్మడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి 12 శాతం వాటా తీసుకుంది. జట్టు అమ్మకంపై మాట్లాడడానికి ప్రీతి జింటా అందుబాటులో లేరు.