హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం కేసుల్లో బిసిసిఐ, హైదరాబాద్ క్రికెట్ అసోయేషన్ (హెచ్ సిఎ)కు ఊరట లభించింది. బిసిసిఐ, హెచ్ సిఎలపై వేసిన నాలుగు కేసులను కూడా హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య అక్టోబర్ 5వ తేదీన జరిగిన వన్డే మ్యాచ్ టికెట్లు బ్లాకులో అముకున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు రాధాకృష్ణ కేసు వేశారు. రాధాకృష్ణ క్రిమినల్ కేసు వేశారు. సంఘంతో సంబంధం లేదని, అందువల్ల అతనికి క్రిమినల్ కేసు నమోదు చేసే అర్హత లేదని హెచ్ సిఎ వాదించింది. అలాగే టికెట్ల అమ్మకంతో బిసిసిఐకి సంబంధం లేదని కూడా వాదించింది. ప్రచారం కోసమే రాధాకృష్ణ కేసులు వేశారని వాదించింది.