ముంబయి: ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హెడెన్ భారత్ ను తృతీయ ప్రపంచ దేశంగా అభివర్ణించారు. క్రెకిట్ టెస్టు సిరీస్ ను 0-2తో ఆస్ట్రేలియా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మందకొడి ఓవర్ రేట్ ను నివారించడానికి తమ కెప్టెన్ రికీ పాంటింగ్ తలొగ్గడాన్ని ఆయన సమర్థించారు. భారత్ పర్యటన అనుభవంతో పాంటింగ్ మరింత సమర్థుడిగా ముందుకు రాగలడని, సమీప భవిష్యత్తులో మరో ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును తయారు చేయగలడని హెడెన్ అన్నట్లు ది డైలీ టెలీగ్రాఫ్ రాసింది. పాంటింగ్ తన నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధిస్తూ వచ్చాడని, వ్యక్తిగా, కెప్టెన్ గా తాను పాంటింగ్ ను పూర్తిగా సమర్థిస్తానని ఆయన అన్నారు. మరో ఆరు నెలల్లో జట్టును ఎలా రూపొందిస్తాడో మీరే చూస్తారని ఆయన అన్నారు.