హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న జెనీవా ఫిడే గ్రాండ్ ప్రీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన ఆరో రౌండ్లో హరికృష్ణ 38 ఎత్తుల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లెవాన్ అరోనియన్ (అర్మేనియా)ను ఓడించాడు.
ఈ చెస్ ఈ టోర్నీలో హరికృష్ణకు ఇది రెండో విజయం కావడం విశేషం. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హరికృష్ట అంతర్జాతీయ చెస్ ర్యాంకుల్లో 22వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

ఆరో రౌండ్ చివర్లో హరికృష్ణ అనూహ్యంగా పుంజుకోవడంతో రెండు విజయాలు, నాలుగు డ్రాలు అతడి ఖాతాలో చేరాయి. గుంటూరుకు చెందిన హరికృష్ణ ఏడో రౌండ్లో రష్యాకు చెందిన అలెగ్జాండర్ గ్రిస్చుక్తో తలపడనున్నాడు.