అహ్మదాబాద్ : న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో ఐదో రోజు భారత బ్యాట్స్ మెన్ హర్భజన్ సింగ్ అద్భుతంగా ఆడి 165 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇది హర్భజన్ కు టెస్టుల్లో తొలి సెంచరీ కావడం విశేషం. హైదరాబాదీ స్త్టెలిష్ బ్యాట్స్ మన్ 91 పరుగులు చేసి వెటోరీ బౌలింగ్ లో ఔటయ్యాడు. హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్ మన్ వివియస్ లక్ష్మణ్ తో కలిసి బజ్జీ ఆదుకున్నాడు. ఓటమి నుంచి ఈ ఇద్దరు భారత్ ను బయట పడేశారు. 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చిన లక్ష్మణ్ మరోసారి తన అనుభవాన్ని జోడించి భారత్ ను ఆదుకున్నాడు. 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో హర్బజన్ తో కలిసి భారత్ ను ఆదుకున్నాడు. హర్భజన్ దూకుడుగా ఆడుతూ టెస్టుల్లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. 115 పరుగులు చేసి బజ్జీ అవుటయ్యాడు. ఈ వార్త రాసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. #13;