భారత అథ్లెట్ గోమతి మరిముత్తు (30) డోప్ టెస్టులో విఫలమైంది. ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్షిప్ 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించిన గోమతి మరిముత్తు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో మంగళవారం ఆమెపై ప్రాథమిక సస్పెన్షన్ వేటువేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
తమిళనాడుకు చెంది గోమతి ఏప్రిల్ 22న దోహా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లో 2 నిమిషాల 2.70 సెకండ్లలో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించింది. శాంపిల్-ఏలో దోషిగా తేలిన గోమతి.. శాంపిల్-బిలో కూడా డోపీగా రుజువైతే ఆమెపై గరిష్టంగా నాలుగేండ్ల పాటు నిషేధం వర్తిస్తుంది. మరోవైపు ఆసియా ఛాంపియన్షిప్లో గెలిచిన స్వర్ణ పతకాన్ని కూడా భారత్ కోల్పోవాల్సివస్తుంది. ఆసియా చాంపియన్షిప్లో భారత్ మూడు స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
ఫెడరేషన్ కప్ సందర్భంగా గత మార్చిలో నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ గోమతీని పరీక్షించగా.. అందులో పట్టబడింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత అధికారులు సమయానికి తెలియజేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. గోమతి నిషేధిత ఉత్ప్రేకం వాడిందని ముందే తెలిసుంటే.. ఆమెను ఆసియా ఛాంపియన్షిప్కు అనుమతిచేవాళ్ళం కాదని ఆ అధికారి తెలిపారు. అంటే గోమతి ఈ సంవత్సరం రెండు సార్లు డోపింగ్ టెస్టులో విఫలం అయింది.