న్యూఢిల్లీ: కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. కామన్ వెల్త్ షూటింగ్ ఛాంపియన్ షిఫ్ పోటీల్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. డాక్టర్ కర్ని సింగ్ షూటింగ్ రేంజ్ లో శుక్రవారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో భారత్ కు చెందిన గగన్ నారంగ్, పిటి రఘునాథ్ తొలి రోజు స్వర్ణం సాధించారు. అలాగే, 25 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో అనిసా సయ్యీద్, అనురాగ్ సింగ్ మరో స్వర్ణ పతకాన్ని సాధించారు. 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ పెయిర్స్ ఈవెంట్ లో విరాట్ సింగ్, బాపు వంజరే వెండి పతకం సాధించారు. ఛాంపియన్ షిప్ ఎనిమిదో ఎడిషన్ కు భారత జాతీయ రైఫిల్ అసోసియేషన్ 43 మంది సభ్యుల భారత బృందాన్ని 12 దేశాల నుంచి వచ్చే టాప్ షూటర్స్ తో తలపడడానికి నియోగించింది. ట్రయల్స్ కు హాజరు కాకపోవడంతో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 11 రోజుల ఈవెంట్ కు దూరమవుతున్నాడు.