హైదరాబాద్: హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ (27) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్లోని ఏవీజే హైట్స్ అపార్ట్మెంట్లో తన ఇంటిలో శవమై కనిపించాడు. గాయాల కారణంగా ఇటీవలే బాక్సింగ్ నుంచి జితేందర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు.
అప్పటి నుంచి జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. జితేందర్ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్ ప్లాట్ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ప్రీతం పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్పీ సునీత్ మట్లాడుతూ జితేందర్ శరీరంపై పలు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
జితేందర్ విషయానికి వస్తే జూనియర్ బాక్సింగ్లో భారత్ తరపున ఉబ్జెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.