హైదరాబాద్: భారతదేశానికి చెందిన అయిదుగురు బాలికలు ఫసిఫిక్ స్కూల్ గేమ్స్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడి సముద్రం వద్ద బీచ్లో అయిదుగురు ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో మొత్తం అయిదుగురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం నలుగురిని ప్రాణాలతో బయటికి తీయగలిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న రాయల్ అడిలైడె ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన ముగ్గురిని చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రికి తరలించారు.
ఒక పదిహేనేళ్ల బాలిక నితిషా నేగి సముద్రంలో కొట్టుకుపోయింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో అక్కడి సహాయక సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా బాలిక విగతజీవిగా తేలినట్లు గమనించారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపినట్లు అక్కడి విదేశాంగ శాఖ తెలిపింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.