బెంగళూరు: భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా పైన పెట్టిన కేసును ఉపసంహరించుకోనని ప్రముఖ సినీ నిర్మాత, అతని స్నేహితురాలు వందనా జైన్ చెప్పారు. తన పైన దాడికి పాల్పడ్డారంటూ వందనా జైన్ మిశ్రా పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిశ్రాను విచారించిన పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పైన విడుదలయ్యాడు.
ఈ నేపథ్యంలో వందనా జైన్ స్పందించారు. అమిత్ మిశ్రా పైన కేసును తొలుత ఉపసంహరించుకోవాలని భావించానని చెప్పారు. అయితే తాను పెట్టిన కేసు గురించి అమిత్ ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. దీంతో తాను నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెప్పారు.
అమిత్ మిశ్రా కేసు గురించి పట్టించుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. అందుకే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. కేసు కోర్టు, పోలీసుల పరిధిలో ఉందని చెప్పారు. తర్వాత ఏం జరుగుతుందనేది వారే తేలుస్తారని చెప్పారు.