ఆయన వల్లే ఇలా
ఈరోజు తాను సాధించిన దాని అంతటికి కారణం తన కోచ్యేనని అందుకు కోచ్ నందికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. గతేడాది నంది కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు. తన శిష్యురాలైన దీపా కర్మార్కర్కు పద్మశ్రీ అవార్డు లభించడం పట్ల నంది సంతోషం వ్యక్తం చేశారు.
16 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతుంది
దీపా కర్మార్కర్ తన దగ్గర 16 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఆయన తెలిపారు. 'పద్మశ్రీకి దీపా అర్హురాలు. ఆమె ఒక అద్భుతమైన స్పోర్ట్స్పర్సన్. రియో ఒలింపిక్స్లో పతకం సాధించకపోయినా ఆమె ప్రదర్శన పట్ల తాను ఎంతో గర్వంగా ఉన్నా. కచ్చితంగా 2020లో జరిగే ఒలింపిక్స్లో దీపా పతకాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు.
ప్రతి అథ్లెట్ కూడా ఒలింపిక్స్లో పతకం సాధించాలనే
ప్రతి అథ్లెట్ కూడా ఒలింపిక్స్లో పతకం సాధించాలనే లక్ష్యంతోనే వెళతారని చెప్పాడు. తన అకాడమీ ద్వారా దీపా కర్మార్కర్ లాంటి క్రీడాకారులను దేశానికి ఎంతో మందిని అందించాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఓ చిన్న అకాడమీని నడుపుతున్నానని అన్నాడు.
రియో ఒలింపిక్స్లో దీపా కర్మార్కర్ అద్భుత ప్రదర్శన
రియో ఒలింపిక్స్లో దీపా కర్మార్కర్ అద్భుత ప్రదర్శనను చూసిన తర్వాత తన వద్ద కోచింగ్ నేర్చుకుంటామని శిష్యులు వస్తున్నట్లు తెలిపాడు. తన వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీపాలాగా మమ్మల్ని కూడా తయారు చేయాలని అడుగుతున్నారని అన్నాడు. త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న నేతాజీ సుబాష్ రీజినల్ కోచింగ్ సెంటర్లో దీపా శిక్షణ పొందుతుంది.