దీపక్ పూనియా 7-6 తేడాతో కార్లోస్ ఈక్విర్డో(కొలంబియా)పై గెలిచి సెమీఫైనల్స్కు దూసుకెళ్లాడు. దీంతో 2020లో టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన నాలుగో భారత రెజ్లర్గా నిలిచాడు. ఇప్పటికే వినేశ్ ఫొగట్, భజరంగ్ పూనియా, రవి కుమార్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
యూనివర్స్ బాస్' క్రిస్ గేల్కు వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పిన కేఎల్ రాహుల్!
అంతేకాదు పైనపేర్కొన్న ముగ్గురు సెమీస్లో తమ ప్రత్యర్థులను ఓడించి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అంతకముందు జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయిన దీపక్ పూనియా ఈ టోర్నీలో కోడిరౌవ్(టర్కీమెనిస్థాన్)పై 6-0తో విజయం సాధించి లాస్ట్-8కు దూసుకెళ్లాడు. దీపక్ పూనియా సెమీపైనల్లో స్టీఫెన్ రైచ్ ముత్(స్విట్జర్లాండ్)తో తలపడనున్నాడు.
మరోవైపు నాన్ ఒలింపిక్ 61 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రాహుల్ అవేర్ సెమీస్కు చేరాడు. రాహుల్ అవేర్ 10-7 తేడాతో కజికిస్తాన్కు చెందిన కైలియెవ్పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.