హైదరాబాద్: ఇరు కుటుంబాలు, సమాజం, ఇరు దేశాల శ్రేయస్సు దృష్ట్యా అయేషా కుటుంబానికి, షోయబ్ మాలిక్ ల మధ్ రాజీ కుదిర్చామని పెద్దలు ఖాద్రీ తదితరులు చెబుతున్నారు. తాను పెళ్లి చేసుకుంది మహానా, అయేషానా అనే విషయం పక్కన పెట్టి విడాకులు ఇవ్వాలని షోయబ్ కు చెప్పామని వారు చెప్పారు. అయేషా, షోయబ్ ల పెళ్లి జరిగిందా లేదా అనేది చర్చనీయం కాదని వారంటున్నారు. నిఖానామా మీద షోయబ్ సంతకం ఉందని వారు చెబుతున్నారు. వివాదం కొనసాగితే సమాజంలోకి తప్పు సంకేతాలు పోతాయని భావించామని వారంటున్నారు. వివాదం సామరస్య పూర్వకంగా సద్దుమణగాలని భావించామని వారు చెప్పారు. పాకిస్తాన్, భారత్ ల మద్య సంబంధాల దృష్ట్యా కూడా ఇరు కుటుంబాల మధ్య సామరస్యం అవసరమని భావించినట్లు తెలిపారు.