మూడంతస్తుల భవనంలో...
ఒలింపిక్స్ గేమ్స్ సందర్భంగా క్రీడాగ్రామంలో భారత అథ్లెట్లకు మూడు అంతస్తులు ఉన్న భవనం ఇచ్చారు. 128 మందితో కూడిన భారత బృందంతో పాటు ఈ అంతస్తులో దక్షిణాఫ్రికా మరియు బెల్జియం అథ్లెట్లు కూడా షేర్ చేసుకోకున్నారు. అంటే ఈ రెండు దేశాలకు చెందిన క్రీడాకారులకు కూడా ఇదే అంతస్తులో బస చేయనున్నారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ ప్లేయర్లలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ట్రైనింగ్ సెషన్ రద్దు అయ్యింది. జట్టులోని మిగతా సభ్యులు క్వారంటైన్లోకి వెళ్లారు. జూలై 21 నుంచే ఫుట్బాల్, సాఫ్ట్బాల్ మరియు బేస్బాల్ లాంటి గేమ్స్ ప్రారంభం అయ్యాయి.
|
క్రీడాగ్రామంలో భారతీయ వంటకాలు
ఇక టోక్యో ఒలింపింక్ విలేజ్లో భారతీయ క్రీడాకారులు బసచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని వారు చెప్పారు. అంతేకాదు ఆతిథ్యం పరంగా ఎలాంటి డోకా లేదని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక భారత క్రీడాకారుల ఆహార విషయానికొస్తే.. వీరికోసం చోలే భటూరే, నాన్, ఓక్రా, మరియు వంకాయలాంటి శాఖాహారం వడ్డిస్తున్నారట. ఇక మాంసాహారం విషయానికొస్తే ఎలాంటి సెలెక్టివ్ మెనూ లేదట. ఏదైనా తినేందుకు వెసులుబాటు కల్పించినట్లు సమాచారం.
ఆంక్షల సడలింపు
ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్లో క్రీడాకారులు ఎక్కడైనా తిరిగేలా ఏర్పాటు చేశారు. కరోనా ఉందని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని మాత్రమే బయటకు అడుగుపెట్టాలనే నిబంధన పెట్టారు.ఈ క్రమంలోనే భారత క్రీడాకారులు మాత్రం చాలా పరిమితంగా బయట తిరుగుతున్నట్లు సమాచారం.
చాలా జాగ్రత్తగా గేమ్స్ విలేజ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శిక్షణా శిబిరం ఉన్న ప్రాంతం ఆ తర్వాత వక్రీడాకారులు బస చేస్తున్న ప్రాంతాల్లో మాత్రమే తిరుగుతున్నట్లు భారత ఒలింపిక్స్ సంఘం వెల్లడించింది. జూలై 23వ తేదీ నుంచే భారత క్రీడాకారులు తమ ఈవెంట్స్లో పాల్గొంటారు. ముందుగా ఆర్చరీ ఉంటుంది. అయితే మెడల్ ఈవెంట్స్ మాత్రం జూలై 24 శనివారం నుంచి ప్రారంభం అవుతాయి.